Friday, April 19, 2024

క‌ల్న‌ల్ సంతోష్ బాబుకి మ‌హావీర్ చ‌క్ర పురస్కారం..

దివంగత కల్నల్ సంతోష్ బాబు త్యాగాన్ని భారత దేశం గుర్తించింది. ఆయన చేసిన త్యాగానికి గానూ మరణానంతరం మహావీర్ చక్రతో సత్కరించింది. నేడు ఆయనకు మహావీర్ చక్రను ప్రదానం చేశారు. ఈ అవార్డును ఆయ‌న భార్య అందుకున్నారు. గల్వాన్ లోయలో చైనా ఆర్మీతో వీరోచితంగా పోరాడి కల్నల్ సంతోష్ బాబు మరణించిన సంగతి తెలిసింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కల్నల్ సంతోష్ బాబు త్యాగాన్ని స్మరించుకుని నగదు పరిహారంతో పాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చింది.

సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్ బాబు భారత దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చారు. గతేడాది చైనా దొంగ దెబ్బలో సంతోష్ బాబు మరణించాడు. లఢక్ రీజియన్ లో గాల్వాన్ ఘటనలో ఆయన వీరమరణం పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement