Wednesday, April 24, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హెచ్ఆర్సీలో దంపతులు ఫిర్యాదు

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్‌‌ తమపై కక్షగట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటూ మహబూబ్నగర్ కి చెందిన దంపతులు మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించడం సంచలనం రేపుతోంది. తమ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారని.. అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ మహబూబ్‌నగర్‌కి చెందిన విశ్వనాధరావు, పుష్పలత దంపతులు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన ఓ కేసు విషయంలో సాక్షిగా ఉన్న తనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్‌ కక్షగట్టి తమను వేధింపులకు గురిచేస్తున్నారని దంపతులు ఆరోపిస్తున్నారు. తమ ప్రైవేటు ఉద్యోగాల నుంచి కూడా తీసేయించారని.. కుటుంబాన్ని రోడ్డున పడేశారని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రూరల్ సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. వేధింపులు ఆపకపోతే ఆ ఇద్దరి పేర్లు రాసి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకోవడమే దిక్కని వాపోయారు.

ఇది కూడా చదవండి: రామప్పపై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది: హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement