Wednesday, April 17, 2024

వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

మహాశివరాత్రి సందర్భంగా శివాల‌యాలు శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిపోతున్నాయి. శైవ‌క్షేత్రాల‌న్ని భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. మహా శివరాత్రి సందర్బంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు.  వేముల‌వాడ రాజ‌న్న ఆల‌యంలో సాయంత్రం 4 గంట‌ల‌కు శివ‌దీక్ష స్వాముల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. సాయంత్రం 6:05 గంట‌ల‌కు స్వామి వారి క‌ల్యాణ‌మండ‌పంలో మ‌హాలింగార్చ‌న నిర్వ‌హించ‌నున్నారు. రాత్రి 11:35 గంట‌ల‌కు లింగోద్భ‌వ స‌మ‌యంలో మ‌హాన్యాస పూర్వ‌క రుద్రాభిషేకం నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement