Saturday, April 20, 2024

కారుని ఢీకొన్న బస్సు.. 11 మంది దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయలు

కారుని ఢీకొంది బస్సు..ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఝల్లార్‌ వద్ద బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో 11 మంది దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సిమలా ప్రసాద్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement