Wednesday, April 24, 2024

ప్రారంభమైన మేడారం హుండీ లెక్కింపు

భూపాలపల్లి: మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర హుండిల లెక్కింపును దేవాదాయ శాఖ అధికారులు బుధవారం ప్రారంభించారు. హనుమకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టిటిడి కల్యాణ మండపంలో పోలీస్ సిబ్బంది బందోబస్తుతో లెక్కింపు నిర్వహిస్తున్నారు. 497 హుండీలను 2వారాలు అవుంతుందని దేవాదాయశాఖ ఏవో రాజేంద్రం తెలిపారు. పలు దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ‌ల‌ వారు లెక్కింపులో పాల్గొన్నారన్నారు. ఉదయం 8నుండి సాయంత్రం 6వరకు లెక్కింపు ఉంటుందన్నారు. గత మేడారం జాతరకు 11కోట్లు వచ్చాయని, ఇప్పుడు ఎక్కువగా వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement