Thursday, March 28, 2024

భార‌త్ జోడో యాత్ర‌లో ‘విలాసాల విడిది’.. బీజేపీ ఆరోపణలకు కాంగ్రెస్ సూపర్​​ కౌంటర్​!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌పై బీజేపీ అక్కసు వెళ్లగక్కుతోంది. ఆ రాహుల్​ పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్​ను చూసి తట్టుకోలేక నానా రకాల పోస్టులు, ఛీప్​ కామెంట్స్​ చేస్తున్నారు కొంతమంది బీజేపీ నేతలు. అంతేకాకుండా రాహుల్​ గాంధీతోపాటు ఆయనతో పాల్గొంటున్న లీడర్లంతా విలాసాల విడిది చేస్తున్నారనే ప్రచారం చేశారు. దీనిపై కాంగ్రెస్​ పార్టీ స్పందించింది. బీజేపీ చేస్తున్న విష ప్రచారానికి బిగ్​ కౌంటర్​ ఇచ్చింది.. దీనిపై కాంగ్రెస్ పార్టీ సోమ‌వారం ఓ వీడియో సాక్ష్యంతో వివ‌ర‌ణ ఇచ్చింది.

ఇవ్వాల 14 కిలో మీట‌ర్ల మేర సాగిన పాదయాత్ర తర్వాత యాత్ర‌లో పాలుపంచుకున్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఓ పెద్ద గోడౌన్‌లా క‌నిపిస్తున్న బిల్డింగ్​లో నేల మీదే ప‌రుపులు వేసుకుని ప‌డుకున్నారు. ఈ విడిదిలో పురుషులు, మ‌హిళ‌లు అన్న తేడా లేకుండా పార్టీ శ్రేణులంతా ఎవ‌రికి వారు త‌మ‌కు ఇచ్చిన ప‌రుపులు ప‌రుచుకుని ప‌డుకున్నారు. భార‌త్ జోడో యాత్ర‌లో 5 స్టార్ విలాసాలు అంటూ బీజేపీ చేసిన ఆరోపణల విడిది ఇదేనని కాంగ్రెస్ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలు మ‌నీష్ కందూరి తెలిపారు. ఈ మేరకు తను ట్విట్టర్​లో ఈ వీడియోని పోస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement