Tuesday, April 23, 2024

లారీ, జీపు ఢీకొని ఆరుగురు మృతి

ఓ జీపు లారీని ఢీకొన్న ప్ర‌మాదంలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా, మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ విషాద ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమేథీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున అమేథీ జిల్లాలోని గౌరీగంజ్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ పెండ్లి జీపు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో జీపులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. రాయ్‌బరేలీలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. మృతుల్లో ఎనిమిదేండ్ల బాలుడు కూడా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement