Friday, April 19, 2024

ఆర్టీసీ బస్సులపై దూసుకొచ్చిన లారీ..

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నగరంలోని నూతన బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై లారీ అదుపు తప్పి రెండు ఆర్టీసీ బస్సుల మీదకి దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు రెండు బస్ లల్లో ప్యాసింజర్లు లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. మహారాష్ట్రకు చెందిన లారీ,వైరా వైపు నుంచి అతివేగంగా వచ్చి నూతన  బస్టాండ్ లోపలకి వెళ్తున్న రెండు బస్సులను డీ కొట్టింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement