Tuesday, March 26, 2024

జ‌న‌సేన‌లో చేరిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ‘లోళ్ల రాజేష్’

ఈ నెల 14న జ‌న‌సేన‌ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు గుంటూరు మంగ‌ళ‌గిరి మండ‌లం ఇప్ప‌టం గ్రామంలో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ ద‌ఫా పార్టీ ఆవిర్భావ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పార్టీ నేత‌లు భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుక‌ల నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో ఓ కొత్త జోష్ క‌నిపిస్తోంది. ఈ జోష్‌కు మరింత మేర ఉత్సాహం నింపేలా శ‌నివారం ఓ ఘ‌ట‌న చోటుచేసుకుంది. జ‌న‌సేన‌లోకి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కళ్యాణి గ్రూప్స్ అధినేత లోళ్ల రాజేష్ చేరిపోయారు. శనివారం పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆయ‌న పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌న‌సేన‌లోకి చేరేందుకు వ‌చ్చిన రాజేష్‌కు పార్టీ కండువా కప్పిన నాదెండ్ల ఆయ‌న‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement