Friday, March 29, 2024

పెగాసస్ పై చర్చకు విపక్షాల పట్టు..

పెగాసస్ ఆంశం పార్లమెంట్ ను కుదిపేస్తోంది. పెగాసస్ వ్యవహారంపై విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. పెగాసస్‌పై చర్చ చేపట్టాలని విపక్షసభ్యుల నినాదాలతో లోక్ సభ, రాజ్యసభ దద్దరిల్లింది.  ఈ క్రమంలో ఉభయ సభలు పలు సార్లు వాయిదా పడ్డాయి. అయితే విపక్ష సభ్యులు లోక్ సభలో ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ ఓం బిర్ల సమావేశాలను సోమావారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ మూడోసారి మధ్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా పడింది. సస్పెన్షన్​కు గురైన టీఎంసీ ఎంపీ శంతను సేన్​ సభను వీడకుండా ఆందోళనలు కొనసాగించడం వల్ల డిప్యూటీ ఛైర్మన్​ సభను వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement