Saturday, April 20, 2024

మహారాష్ట్ర లో వారంతాల్లో లాక్ డౌన్..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో సెకండ్ వేవ్ ఉద్ధృతంగా కొనసాగుతోంది. దేశంలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువశాతం ఆ రాష్ట్రం నుంచి వస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో వారాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటన చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించాలని పేర్కొంది. ప్రజా రవాణా వాహనాలను 50 శాతం సామర్థ్యంతోనే తిప్పాలని స్పష్టం చేసింది. హోటళ్లలో పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా పగటివేళల్లోనే ఫుడ్ డెలివరీలకు అనుమతి ఇచ్చింది. త్వరలోనే పరిస్థితిని సమీక్షించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement