Thursday, March 28, 2024

తమిళనాడులో ఈ ఆదివారం లాక్ డౌన్

కొవిడ్ కేసుల పెరుగుదలతో తమిళనాడులో ఈ ఆదివారం లాక్ డౌన్ ఉంటుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. విమానాశ్రయం, బస్, రైల్వే స్టేషన్‌లకు ఆటోలు, టాక్సీలు వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు. తమిళనాడులో ఒక్కరోజే కొత్త కొవిడ్ కేసులు 28,561 నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,42,796కు చేరుకుంది. రికవరీల సంఖ్య 28,26,479కి చేరుకుంది. కాగా, 24 గంటల్లో 19,978 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,79,205 మంది చికిత్స పొందుతున్నట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement