Saturday, April 20, 2024

న‌కిలీ యాప్స్ ద్వారా వంద‌ల‌కోట్ల మోసం .. 14మంది అరెస్ట్ ..

రాను రాను సైబ‌ర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేరాల్లో కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొడుతున్నారు అగంత‌కులు. పోలీసులు ఎన్ని జాగ్ర‌త్త‌లు చెప్పినా సైబ‌ర్ నేర‌గాళ్ళ ఉచ్చులో ప్ర‌జ‌లు ప‌డుతూనే ఉన్నారు. కాగా మ‌న దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం గుట్టు రట్టు చేసిన‌ట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్ల‌డించారు. లోన్ బజార్, ద లోన్ ఇండియా, ఎస్బీఐ ధనీ బజార్ పేర్లతో నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక స్ఫూఫింగ్ యాప్ ద్వారా ఎస్బీఐ అసలైన కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వస్తున్నట్టు నమ్మిస్తూ జనాలను వీరు మోసం చేస్తుండ‌టం విశేషం. దాంతో జ‌నం న‌కిలీ ఏదో అస‌లు ఏదో తెలుసుకోలేక‌పోయారు.

కాగా ఈ కాల్ సెంటర్ నుంచి ఏడాది కాలంలో 33 వేల కాల్స్ చేశారని… కోట్ల రూపాయలను కాజేశారని స్టీఫెన్ వివ‌రించారు. ఎస్బీఐ ఏజెంట్ల నుంచి కస్టమర్ల వివరాలు తీసుకుని క్రెడిట్ కార్డు ఉన్నవారి నుంచి డబ్బులు కాజేస్తున్నారన్నారు. ఈ యాప్ వాడకంలో ఫర్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించారని తెలిపారు. 18601801290 అనే నంబర్ నుంచి స్ఫూఫింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ముఠాపై దేశ వ్యాప్తంగా 209 కేసులు నమోదయ్యాయని స్టీఫెన్ రవీంద్ర వివ‌రించారు. మొత్తం 14 మందిని అరెస్ట్ చేశామని… 30 సెల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు, కారు, బైక్స్ ని స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement