Friday, April 19, 2024

ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాల లావాదేవీల‌పై మోడీకి లేఖ..ఎంపీ ర‌ఘురామ‌..

అప్పులు తెచ్చే పాల‌కుల‌ను ప్ర‌జ‌లు హ‌ర్షించ‌ర‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అన్నారు. ప్ర‌ధాని స్ఫూర్తితో పెట్రోల్..డీజిల్ పై రాష్ట్రాలు సుంకాలు త‌గ్గించాయ‌ని చెప్పారు. ఏపీలో కూడా పెట్రోల్,డీజిల్ రేట్ల‌ను త‌గ్గించాల‌ని సూచించారు. లిక్క‌ర్ విక్ర‌యాల్లో డిజిట‌ల్ పేమెంట్ విధానాన్ని అమ‌లు చేయాల‌న్నారు. ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాల లావాదేవీల‌పై ర‌ఘురామ ప్ర‌ధాని మోడీకి లేఖ రాసిన‌ట్లు వెల్ల‌డించారు. డిజిట‌ల్ విధానంలో లావాదేవీలు జ‌రిగే విధంగా కేంద్రం జోక్యం చేసుకోవాల‌ని తెలిపారు. కాగా సొంత పార్టీతో పాటు సొంత పార్టీ నాయ‌కుల‌పై కూడా ఫైర్ అవుతుంటారు ఈ రెబ‌ల్ ఎంపీ. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ పై కూడా ప‌లు ఆరోప‌ణ‌లు చేశారాయ‌న‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement