Thursday, April 25, 2024

వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం బీచ్ లో సంద‌డి చేసిన లెస్బియ‌న్ జంట‌.. వైర‌ల్ గా పొటోస్

త‌మ కొత్త జీవితానికి స్వాగ‌తం ప‌లికారు కేర‌ళ‌కి చెందిన లెస్బియ‌న్ జంట‌. కేరళకు చెందిన ఆదిలా నసరిన్, ఫాతిమా నూరా అనే లెస్బియన్ జంట అందమైన వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వీరు పెళికూతుర్లుగా ముస్తాభైన పొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. బీచ్ లో ఘనంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని కొత్త జీవితానికి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇద్దరూ స్కూల్లో చదువుకునే సమయం నుంచి స్నేహితులు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ, ఈ జంట ప్రేమ విషయం తెలిసినప్పుడు ఇద్దరి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో తమ పరువు ఏమౌతుందని ఒప్పుకోలేదు.

దీంతో ఈ ఏడాది మేలో ఇద్దరూ కోజికోడ్ పారిపోయారు. ఎల్ జీబీటీక్యూ సొసైటీ ఆశ్రయంలో ఉన్నారు. తల్లిదండ్రులు వారి వద్దకు వెళ్లి పెండ్లికి ఒప్పుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళను తీసుకువెళ్లారు. కానీ ఇంటికి వెళ్లాక పెళ్లి కుదరదని మాట మార్చారు. తమ ప్రేమను దక్కించుకునేందుకు నసరీన్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు అనుకూలంగా వచ్చింది. ఇద్దరికీ కలిసి జీవించే హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టబద్దమైన చిక్కులు వీడడంతో ల్ జీబీటీక్యూ సొసైటీ వీరికోసం బీచ్ లో వేదిక ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో ఇద్దరు రింగులు మార్చుకుని ఒకటయ్యారు. లెహంగా ధరించి, పూలదండలు వేసుకుని… ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఈ జంట ఫోటోలను సనరీన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీచ్ లో ఇలాంటి ఫోటో షూట్ లు నిర్వహించడం ఆసక్తిగా ఉందని నసరీన్ చెప్పింది. భవిష్యత్తులో తాము ఇద్దరం పెళ్లి చేసుకుంటామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement