Saturday, April 20, 2024

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ..

లేపాక్షి ప్రభ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేపాక్షి శ్రీ దుర్గపాపనేశ్వర ఆలయం ను సందర్శించారు. వీరభద్ర స్వామి సత్యనారాయణ ఇంటి దేవుడు కావడం వల్ల ప్రతి ఏటా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కార్తీక మాసం చివరి శనివారం కావడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వ‌చ్చారు. కాగా వారికి ఆలయ ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు వీరభద్ర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

వీరభద్ర స్వామి,దుర్గాదేవికి వస్త్రాలు అందజేశారు.. అలానే ఇరువురు దేవుళ్ళకు రెండు జతల బంగారు కళ్ళని ఆలయ ఈవో నరసింహమూర్తి కి అందజేశారు. ఆలయ ప్రత్యేకత గురించి గైడ్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ ను హిందూపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండూరు మల్లికార్జున శాలువాతో సన్మానించారు. ఆలయ ఈవో, ఆలయ అర్చకులు ఆలయ జ్ఞాపికను అందజేశారు. సజ్జనార్ మాట్లాడుతూ మా ఇంటి దేవుడైన శ్రీ వీరభద్ర స్వామిని దర్శనం కోసం ప్రతియేటా లేపాక్షి కి రావడం ఆనవాయితీగా వస్తుంద‌న్నారు. లేపాక్షి ఆలయం లోని శిల్పాలు అద్భుతం అని కొనియాడారు. లేపాక్షి సందర్శనార్థం వచ్చిన సజ్జనార్ కు పోలీసులు బందోబస్తు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement