Thursday, March 28, 2024

ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో దాదాపు 2వేల కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.జ తక్కువ టెస్టులు చేస్తున్నా కేసులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,657 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,941 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 424 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 323, విశాఖ జిల్లాలో 258, నెల్లూరు జిల్లాలో 231, కృష్ణా జిల్లాలో 212, శ్రీకాకుళం జిల్లాలో 102, కర్నూలు జిల్లాలో 86, కడప జిల్లాలో 74, అనంతపురం జిల్లాలో 71, ప్రకాశం జిల్లాలో 59, విజయనగరం జిల్లాలో 49, తూ.గో. జిల్లాలో 27, అనంతపురం జిల్లాలో 23, ప.గో. జిల్లాలో 25 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 835 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రకాశం జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,10,943 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,91,883 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 11,809గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,251గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement