Thursday, April 18, 2024

నేపాల్ లో కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డి.. 17మంది మృతి

నేపాల్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా కొండచరియలు విరిగిపడ‌డంతో ఇప్పటి వరకు 17మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి.

వరదలకు తీవ్రంగా ప్రభావితమైన సుదుర్‌ పశ్చిమ్‌ ప్రావిన్స్‌లోని అచ్చం జిల్లాలో కొండచరియలు విరిగిపడగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో మరో 11 మంది గాయపడ్డారని, మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సుర్ఖేత్‌ జిల్లాకు విమానంలో తరలించారు. ప్రస్తుతం గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement