Thursday, April 18, 2024

Flash: వరంగల్ కలెక్టర్ ను ముట్టడించిన రైతులు

వరంగల్ కార్పొరేషన్ లో ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీవెన్స్ సెల్ లో కమిషనర్ ప్రావీణ్యతో రైతులు వాగ్వివాదానికి దిగారు. దీంతో GWMC గ్రీవెన్స్ ఉద్రిక్తంగా మారింది. వరంగల్ కలెక్టర్ ను ముట్టడించారు. రైతుల ప్రమేయం లేకుండా సర్వే నెంబర్లతో పత్రిక ప్రకటన ఎలా ఇచ్చారని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం మా వ్యవసాయ భూములు లాక్కోని రియలేస్టేట్ చేయాలని చూడటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. తమ వ్యవసాయ భూముల జోలికి రావద్దని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలి బాధితులు డిమాండ్ చేశారు. KUDA చేపట్టిన ప్రక్రియను నిలిపివేయాలన్నారు. ప్రభుత్వం వద్ద ఖజానా లేకపోతే రైతులందరం బిక్షం ఎత్తుకొని పైసలు ఇస్తామంటూ రైతు ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్ బుద్దె పెద్దన్న వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement