Tuesday, April 23, 2024

హ్యాట్సాఫ్ టీచర్.. ప్రభుత్వ పాఠశాలలో చేరితే రూ.వెయ్యి డిపాజిట్

కర్ణాటకలోని ఓ టీచర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్యను పెంచేందుకు వినూత్న ప్రయత్నం చేస్తోంది. పాఠశాలలో ఒకటో తరగతిలో చేరే ప్రతి విద్యార్థి పేరున నూలగ్గెరి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు రేఖా ప్రభాకర్​ రూ.వెయ్యి డిపాజిట్​ చేస్తున్నారు. పదో తరగతి పూర్తి చేసుకున్న తర్వాత పై చదువులకోసం వడ్డీతో సహా ఆ డబ్బుల్ని వారు తీసుకోవచ్చు. ఆమె చేసిన ఈ ప్రయత్నంతో ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.

2010లో రేఖకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ బాధ్యతలు చేపట్టేనాటికి ఆ బడిలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 20 మాత్రమే. ఏడాదికి కేవలం ఒక్కరో, ఇద్దరో చిన్నారులు మాత్రమే పాఠశాలలో చేరేవారు. దాంతో బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఆమె నిర్ణయించుకున్నారు. పిల్లలను తమ పాఠశాలకు పంపించమని గ్రామ ప్రజల్ని, రాజకీయ నాయకుల్ని కోరినా ఫలితం దక్కలేదు. దీంతో తమ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరే ప్రతి చిన్నారి పేరున వెయ్యి రూపాయలు డిపాజిట్​ చేస్తున్నట్లు ప్రకటించారు. అది ఆమె సొంత డబ్బు. ఇందుకు ఆమె భర్త కూడా సహకరించాడు. ఆమె చేసిన ఈ ప్రయత్నం ఫలించింది. మెల్లమెల్లగా పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement