Thursday, March 28, 2024

కుప్పంని వీడే ప్ర‌స‌క్తే లేదు – చంద్ర‌బాబునాయుడు

తాను కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలిపెడుతున్నాన‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. తాను ఎప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేతలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు కొనియాడారు. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కార్యకర్త ఒంటిపై పడే దెబ్బను నాకు తగిలిన దెబ్బగానే భావిస్తా అని అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లను నేరుగా తెలుసుకునేందుకు కుప్పం ప‌ర్య‌ట‌న‌కి వ‌చ్చాన‌ని చంద్ర‌బాబునాయుడు వెల్ల‌డించారు. కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. దాంతో ఆయ‌న‌కి పార్టీ శ్రేణులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో మూడు రోజులు ఉంటాన‌ని తెలిపారు. కాగా ఆయ‌న దేవ‌రాజుపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement