Thursday, April 25, 2024

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు కేటీఆర్ లేఖ

కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని లేఖలో తెలిపారు. కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. ఈ రోడ్ల మూసివేత అంశానికి సంబంధించి పలుసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామన్నారు. గతంలోనూ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని లేఖలు రాసిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైన నాలుగు రోడ్లను కొవిడ్ కేసుల పేరు చెప్పి మూసివేసిందన్నారు. దీంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: రేపు చలో రాజ్‌భవన్ కి కాంగ్రెస్ పిలుపు

Advertisement

తాజా వార్తలు

Advertisement