Thursday, March 28, 2024

ఫ్రీఫైర్ గేమ్ కోసం విద్యార్థుల మధ్య ‘వార్’

కృష్ణా జిల్లాలో ఫ్రీ ఫైర్ గేమ్ రెండు గ్రూపుల మధ్య చిచ్చురేపింది. గన్నవరంకు చెందిన కొందరు యువకులు ఆన్‌లైన్ ఫ్రీ ఫైర్‌ గేమ్‌ ఆడుకుంటున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి పామర్తి నగర్‌కు చెందిన మరికొంతమంది యువకులతో కలిసి ఈ గేమ్ ఆడుతున్నారు. గేమ్‌ విషయంలో ఇద్దరు యువకుల మధ్య వివాదం జరిగింది. గన్నవరంకు చెందిన ఓ యువకుడిని పామర్తి నగర్‌కు చెందిన యువకుడిని కొట్టాడు. ఈ వ్యవహారం రెండు గ్రూపుల మధ్య చిచ్చురేపింది. దీంతో రెండు గ్రూపులు కర్రలు, బ్లేడులో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది విద్యార్థులు దాడులకు పాల్పడగా గణేష్ అనే విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. దాడులకు సంబంధించి పోలీసులు 10 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవలో ఉన్న యువకులు గన్నవరం చుట్టు పక్కల గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా మైనర్‌లు కావడంతో పోలీసులు తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement