Saturday, April 20, 2024

రేపు టీఆర్ఎస్ లో చేరనున్న కౌశిక్ రెడ్డి..

హుజురాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకియాలు రసవత్తరంగా మారుతున్నాయి…మాజీ కాంగ్రెస్ నేత హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రేపు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆయన ప్ర‌క‌టించారు. యోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, త‌న మ‌ద్ద‌తుదారుల‌ కోరిక మేర‌కు.. టీఆర్ఎస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాని తెలిపారు. అంతేకాదు తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితుడయ్యానని.. కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఇక సీఎం కేసీఆర్ ఇచ్చిన అవ‌కాశాన్ని ఈట‌ల రాజేంద‌ర్ దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈట‌ల రాజేంద‌ర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని…త‌న‌కు తన సొంత అభివృద్ధి కోసం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని కౌశిక్ రెడ్డి మండిప‌డ్డారు.

ఇది కూడా చదవండి: ఆగస్టు నెల తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement