Thursday, April 25, 2024

రూ.50 కోట్లతో పీసీసీ పదవి కొన్నాడు: రేవంత్ పై కౌశిక్ సంచలన ఆరోపణ

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో పాటు పీసీసీ కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు సోనియాగాంధీకి తన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి తన రాజీనామాకు ఉత్తమ్​కుమార్​ రెడ్డికి సంబంధం లేదన్నారు. ఇది తన సొంత నిర్ణయమని, చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్‌‌కు రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పదవి పొందారని ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవదన్న రేవంత్‌ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీనియర్లను కాదని టీడీనీ నుంచి వచ్చిన రేవంత్‌కు పీసీసీ ఇవ్వడం దారుణమన్నారు. అమ్ముడుపోయింది తాను కాదని.. రేవంత్​ రెడ్డి ఈటల రాజేందర్​కు అమ్ముడుపోయారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ రెడ్డి లక్ష రెట్లు నయం అని, కార్యకర్తల్లో ధైర్యం నింపారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడికి తాకట్టు పెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు పిచ్చోళ్లలా కనపడుతున్నామా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్​లో కాంగ్రెస్​ పార్టీ డిపాజిట్ అయినా​ తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి కౌశిక్​రెడ్డి సవాల్‌ విసిరారు. ఆరు నెలల్లో కాంగ్రెస్​ పార్టీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్‌రెడ్డి సీఎం అవుతారా అంటూ ఎద్దేవా చేశారు.

‘’ సినిమా యాక్టర్‌లా రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. సినిమాలో ముమైత్ ఖాన్‌ వస్తే చప్పట్లు, ఈలలు కొడతారు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు… సీఎం సీఎం అంటే సరిపోతుందా? టీపీసీసీ చీఫ్ పదవి వస్తే ముఖ్యమంత్రి అయినట్టు భావిస్తున్నారు’’ అని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. పొన్నం ప్రభాకర్ హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారు. ఆరు నెలల్లో మొత్తం ఖాళీ అవుతుందని జోష్యం చెప్పారు. రేవంత్ రాకతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పోదెం వీరయ్య, భట్టి విక్రమార్కతో సహా ఎవరూ హ్యాపీగా లేరన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరిలో ఎందుకు డిపాజిట్లు తెచ్చుకోలేదో చెప్పాలి అని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: కేసీఆరే తెలంగాణ‌కు శ్రీరామ‌ర‌క్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement