Wednesday, April 17, 2024

మిల‌ట‌రీ విందులో కిమ్ ఫ్యామిలీ.. ఆశ్య‌ర్య‌పోయిన అధికారులు

రీసెంట్ గా ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ క‌నిపించ‌ట్లేద‌నే వార్త‌లు బాగా వైర‌ల్ అయ్యాయి. అయితే ఆ వార్త‌ల‌కి ఫుల్ స్టాప్ పెట్టారు కిమ్. త‌న భార్య‌..కుమారైతో క‌లిసి ఓ మిల‌ట‌రీ విందులో పాల్గొన్ని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు కిమ్. చాలా విలాస‌వంతంగా జ‌రిగిన బాంక్వెట్‌కు .. ఫ్యామిలీతో కిమ్ రావ‌డం అంద‌ర్నీ స్ట‌న్ చేసింది. కిమ్‌తో విందులో పాల్గొన్న ఆ అమ్మాయి పేరు జూ యే. ఆమె వ‌య‌సు తొమ్మిదేళ్లు. కిమ్ త‌ర్వాత ఆ దేశ వార‌సురాలు ఆమే అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. భార్య రీ సోల్ జూ కూడా విందులో పాల్గొన‌డం విశేషం.

కొరియ‌న్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కూతురుతో క‌లిసి కిమ్ విందుకు హాజ‌రుకావడం మిలిట‌రీ అధికారుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసిన‌ట్లు స్థానిక మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. కిమ్ ఫ్యామిలీ విందుకు వ‌స్తున్న ఫోటోల‌ను స్థానిక రోడాంగ్ సిన్‌మున్ ప‌త్రిక ప్ర‌చురించింది. బాంక్వెట్‌లో టేబుల్ సెంట‌ర్ సీటులో కిమ్ త‌న కూతుర్ని కూర్చోబెట్టారు. మిలిట‌రీ ఈవెంట్‌కు కూతుర్ని తీసుకువ‌చ్చిన రాచ‌రిక పాల‌న సంకేతాల్ని కిమ్ ఇచ్చిన‌ట్లు నిపుణులు భావిస్తున్నారు. కిమ్ త‌న కూతుర్ని చాలా ఇష్ట‌ప‌డతార‌ని, ఇటీవ‌ల జ‌రిగిన ఓ మిస్సైల్ ప‌రీక్ష స‌మ‌యంలోనూ ఆమెను అక్క‌డ‌కు తీసుకువ‌చ్చిన‌ట్లు క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఇప్పుడు ఏకంగా ఫ్యామిలీతో విందులో పాల్గొన్న‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement