Friday, April 26, 2024

రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో యువతి కిడ్నాప్ కలకలం..

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. సుమారు యాభై మందితో వచ్చి యువతిని అపహరించుకుని వెళ్లారని తెలుస్తోంది. ముందుగా దుండగులు యువతి నివాసంతో పాటు కార్లను ధ్వంసం చేసారు. అనంతరం యువతిని తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన వారిపై దుండగులు దాడికి పాల్పడ్డారని స‌మాచారం. సంఘ‌ట‌న‌కు సంబంధించిన‌ సమాచారం తెలుసుకున్న‌ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. యువతి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మరోవైపు దాడి సమయంలో డయల్ 100కి కాల్ చేసినా పోలీసులు స్పందించలేదని బాధిత యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement