Friday, April 19, 2024

Flash: గ్యాస్ లీకేజీతో చిన్నారి మృతి… ఇద్దరి పరిస్థితి విషమం

గ్యాస్ సిలిండర్ లీకేజీ అయి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నగర శివారులోని సారంగాపూర్ విజయ డైరీ ప్రాంతంలో నివాసం ఉండే సునీల్ భార్య దన్వంతరి, తన ముగ్గురు పిల్లలతో కలిసి పాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి సమయంలో గ్యాస్ సిలిండర్ లీకేజీ అయి మంటలు చెలరేగాయి. ముగ్గురు చిన్నారులతో పాటు ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన వారిని  జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నామ్కి (5) మృతి చెందగా, బబ్లు (9), జగ్గు (4) ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. పరిస్థితి విషమఅంగా ఉంది.  చిన్నారుల తల్లిదండ్రులకు కూడా స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులు బీహార్ కు చెందిన వారని, పాల వ్యాపారం చేస్తూ వీరు జీవనం కొనసాగిస్తూ ఉండేవారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement