Friday, April 26, 2024

Khammam: నిశ్చితార్ధం వేళ విషాదం.. ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఖమ్మం పట్టణంలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఖమ్మంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకుని కానిస్టేబుల్  అశోక్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2020లో పోలీస్ ఏ.ఆర్ కానిస్టేబుల్ గా అశోక్ కుమార్ నియమితుడయ్యాడు. తరువాత కొత్తగూడెం పోలీస్ స్పెషల్ పార్టీలోలో పని చేశాడు. పోలీస్ శాఖలో బదిలీలో ప్రక్రియలో భాగంగా ములుగు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ నెల 8వ తేదీన అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది డోర్ కొట్టడంతో ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో లాడ్జి యాజమాన్యం.. పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చి చూడగా  ఏఆర్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అశోక్ కుమార్ సొంతగ్రామం సత్తుపల్లి నియోజకవర్గంలోని యజ్ఞనారాయణపురం. ఈరోజు సొంత గ్రామంలో అశోక్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమం ఉంది. అయితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement