దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. దీంతో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్ ను ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించాయి. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుండి 16 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విజయన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై సీఎం విజయన్ అధికారులతో చర్చించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగాను సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 8వ తేదీ ఉదయం ఆరుగంటల నుండి లాక్ డౌన్ అమల్లోకి వస్తోందన్నారు. కాగా, బుధవారం నాడు ఒక్క రోజులోనే కేరళలో 41,953 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
కేరళలో సంపూర్ణ లాక్ డౌన్
By mahesh kumar
- Tags
- Corona second wave
- coronavirus cases
- important news
- Important News This Week
- Important News Today
- Kerala lockdown
- Latest Important News
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement