Saturday, April 20, 2024

కేర‌ళ‌లో ఓమిక్రాన్ : బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి పాజిటివ్

ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకి ఎక్క‌డో చోట న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఏపీలో రెండు కేసులు న‌మోదు కాగా..రీసెంట్ గా కేర‌ళ‌లో ఓమిక్రాన్ కేసు న‌మోదు అవ్వ‌డం క‌ల‌క‌లంరేపింది. బ్రిటన్ నుంచి కొచ్చి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి ఈ నెల 6న బ్రిటన్ నుంచి కొచ్చి వచ్చినట్టు గుర్తించారు. ఈ మేరకు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అతడు కేరళకు చెందినవాడేనని వెల్ల‌డించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నారు. తాజా ఒమిక్రాన్ కేసు నేపథ్యంలో దేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 38కి పెరిగింది. నేడు ఏపీ, చండీగఢ్, నాగ్ పూర్, కర్ణాటకలో ఒక్కో ఒమిక్రాన్ కేసు నమోద‌యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement