Friday, April 26, 2024

భ‌విష్య‌త్ లో కేసీఆర్ ప్ర‌ధాని… మ‌హ‌మూద్ అలీ

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ భ‌విష్య‌త్ లో దేశ ప్రధాని అవుతారని రాష్ట్ర‌ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నాంపల్లిలోని తెలంగాణ ఎన్జీవో హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో చేపట్టిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్‭లో మహమూద్ అలీ ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… సీఎంగా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని.. ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోందన్నారు. ఈ క్యాంప్‭లో ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement