Thursday, March 28, 2024

మోడల్ పాలిటిక్స్ చేస్తున్న కేసీఆర్.. రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ మోడల్ పాలిటిక్స్ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ మోడల్ అత్యంత ప్రమాదకరమైందన్నారు. అలాగే బీజేపీ కార్పొరేట్ మోడల్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే పైసలతో ప్రభుత్వాలను పడగొడుతున్నారన్నారు. కర్నాటకలో వందల కోట్లు ఖర్చు చేసేందుకు కేసీఆర్ పయత్నం చేస్తున్నారన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ను అస్థిరపరచాలని చూస్తున్నారన్నారు. ధన రాజకీయాలతో బీఆర్ఎస్ ను విస్తరించాలని చూస్తున్నారన్నారు. అవినీతి సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement