Friday, April 19, 2024

Breaking: పాత ఫోన్లతో ఈడీ కార్యాలయానికి కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత ఫోన్లతో ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. కాసేపట్లో కవిత ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. మూడోసారి ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించనుంది. ఈడీ కార్యాలయానికి బయల్దేరే ముందు కవిత పాత ఫోన్లను మీడియాకు చూపిస్తూ బయల్దేరారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇవ్వనున్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ ఉన్నారు. గతంలో వాడిన ఫోన్లను చూపించారు. రెండు కవర్లలో కొన్ని ఫోన్లను మీడియాకు చూపించారు. గతంలో కవిత ఆధారాలు దొరక్కుండా ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు వెళ్లే ముందు ఆ ఫోన్లు ప్రత్యేకంగా రెండు కవర్లలో వేసి చూపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement