Thursday, April 25, 2024

క‌ర్ణాట‌క సీఎంతో మాట్లాడిన ప్ర‌ధాని మోడీ..ఇళ్లు కూలిన వారికి ల‌క్ష ప‌రిహారం..

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై తో మాట్లాడారు క‌ర్ణాట‌క‌లో భారీ వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో రానున్న 48 గంటలపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈ నెల ప్రారంభం నుంచి కర్ణాటక వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఐదు హెక్టార్లకు పైగా భూమిలో పంట నష్టం జరిగింది. 191 పశువులు మృత్యువాత పడ్డాయని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు అధికార యంత్రాంగం అంచనా వేసిన ప్రకారం 658 ఇళ్లు పూర్తిగా, 8,495 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని కర్ణాటక విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు వెల్లడించారు. ఇళ్లు కూలిన వారికి లక్ష రూపాయల పరిహారం ఇస్తామని సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కర్ణాటక ప్రభుత్వం రోడ్లు, వంతెనల కోసం రూ. 500 కోట్లు విడుదల చేశారు. నగరం చుట్టూ అత్యవసర రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement