Friday, April 19, 2024

క‌ర్ణాట‌కలో క‌ఠిన ఆంక్ష‌లు ..అవేంటో తెలుసా ..

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌లు పెట్టింది. ప్ర‌త్యేకంగా కొవిడ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయ‌డం విశేషం. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో ఇద్ద‌రికి ఒమిక్రాన్ నిర్ధార‌ణ అవ్వ‌డంతో రాష్ట్ర‌ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌యింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికే కార్యాలయాలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి అనుమతిని ఇస్తున్నారు. విద్యార్థుల తల్లితండ్రులకు రెండు డోసులు తప్పనిసరి. భారీ వేడుకలు, కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను 500కి పరిమితం చేసింది. విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందేనని ఆదేశించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రస్తుతానికి రాత్రిపూట కర్ఫ్యూ విధించలేదని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement