Wednesday, April 24, 2024

కంగ‌నార‌నౌత్ పై హైద‌రాబాద్ లో కేసు న‌మోదు..

బాలీవుడ్ న‌టి కంగ‌నార‌నౌత్ పై హైద‌రాబాద్ లో కేసు న‌మోదు అయింది. దేశ స్వాతంత్ర్యాన్ని అవ‌మానించేలా మాట్లాడార‌ని శివ‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సుద‌ర్శ‌న్ ..నారాయ‌ణ‌గూడ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయురాలు అయి ఉండీ కంగన ఇలా మాట్లాడడం సరికాదని, ఇలాంటి పిచ్చికూతలు మానుకోవాలని హెచ్చరించారు. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని, ఇటీవల ఆమెకు ప్రదానం చేసిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుదర్శన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, కంగన చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది.1947లో దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం అసలైనది కాదని, దేశానికి మోదీ ప్రధాని అయ్యాక వచ్చినదే అసలైన స్వాతంత్ర్యమంటూ కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement