Tuesday, April 23, 2024

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ కు కరోనా

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ కు కరోనా సోకింది.. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. “కొద్ది రోజులుగా చాలా అలటగా, కళ్లు మండుతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ వెళదామని కరోనా టెస్టు చేయించుకున్నా. అందులో పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నా. త్వరలోనే దీని నుంచి బయటపడతా. ఎవ్వరూ భయపడొద్దు. మీరు భయపడితే అది భయపెడుతుంది. రండి ఈ చిన్న ఫ్లూ వైరస్​ను తరమికొడదాం హర్ హర్ మహాదేవ్” అంటూ పేర్కొంది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ను ట్విట్టర్ సంస్థ శాశ్వతంగా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గతంలోనూ అనేక సార్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది కంగనా రనౌత్. దేశ సమగ్రత, సామరస్యాలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనను ఆమె పాటించకపోవడం వల్లే ట్విట్టర్ నుండి సస్పెండ్ చేసినట్టు అధికారులు చెప్పారు.  

ఇదీ చదవండి: తెలంగాణలో 18 ఏళ్లు నిండిన వారికి మే 12 తర్వాతే వ్యాక్సిన్ తొలి డోసు..

Advertisement

తాజా వార్తలు

Advertisement