Thursday, April 25, 2024

ఖమ్మం నేతలతో జూపల్లి భేటీ.. ప్రాధాన్యతను సంతరించుకున్న కలయిక

ఖమ్మం బ్యూరో (ప్రభ న్యూస్) : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. కొంత కాలంగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు, సీఎం పర్యటనలకు దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు జిల్లాలో పొంగులేటిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలిసింది.

పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును జూపల్లి కృష్ణారావు దమ్మపేట మండలంలోని తుమ్మల నివాసంలో కలిసినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement