Saturday, April 20, 2024

ఆస్కార్ క‌మిటీలో చేరిన – తొలి ద‌క్షిణాది న‌టుడిగా సూర్య‌

ఆస్కార్ అకాడమి నుండి త‌మిళ స్టార్ హీరో సూర్యకు ఆహ్వానం వ‌చ్చింది. సినీరంగంలో అత్యున్న‌త పురస్కారంగా భావించేది ‘ఆస్కార్’ అవార్డు. జీవితంలో ఒక్క సారైనా ఆస్కార్‌ను అందుకోవాల‌ని సినీప్ర‌ముఖులు ఆరాట ప‌డుతుంటారు. అయితే సూర్య న‌టించిన ‘ఆకాశం నీ హ‌ద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలు ఆస్కార్ వ‌ర‌కు వెళ్లి వెన‌క్కి తిరిగి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కాగా తాజాగా సూర్య‌కు అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఆస్కార్ 2022) నుండి ఆహ్వానం వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 397మంది కార్యనిర్వాహకుల జాబితాను అకాడమీ విడుదల చేసింది. అందులో సూర్య ఒక‌రు. ఆస్కార్ క‌మిటీలో చేరిన తొలి ద‌క్షిణాది న‌టుడిగా సూర్య నిలిచారు. ఆస్కార్ క‌మిటీ స‌భ్య‌త్వానికి ఇండియా నుండి సూర్య‌, కాజోల్‌కు ఆహ్వానం అందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement