Friday, April 26, 2024

ప్రజారోగ్యం కోసం లాక్ డౌన్ పొడిగింపు.. జార్ఖండ్‌ సీఎం కీలక నిర్ణయం

కరోనా వైరస్ కట్టడికి జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 22న ఆ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కు సంబంధించి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. అప్పటి నుంచి వరుసగా ఏడు సార్లు లాక్ డౌన్ ను పొడిగించింది. తాజా లాక్ డౌన్ గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.అంతరాష్ట్ర బస్సు సర్వీసులను అనుమతించబోమని జార్ఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అంతరాష్ట్ర ప్రయాణాలకు సంబంధించి ఈపాస్ ఉండాలని సూచించింది. అధికారుల వాహనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపింది. ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు అన్నీ మూసి ఉంచాలని ఆదేశించింది.

ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అధ్యక్షతన బుధవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ భేటీ అయింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజారోగ్యం కోసం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తున్నామని ఈ సందర్భంగా హేమంత్ సొరేన్ చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల నుంచి రాష్ట్రం ఇంకా బయటపడలేదన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.

కాగా, కొత్త ఆంక్షలు, సడలింపులు ప్రకటించకుండా ప్రస్తుతం ఉన్న ఆంక్షలు కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. గత వారం, సాయంత్రం 4 గంటల వరకు షాపింగ్ మాల్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌ను తెరవడం సహా కొన్ని సడలింపులను ప్రకటించారు.

ఇదీ చదవండి: ఈ నెల 26న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement