Friday, April 19, 2024

‘జేమ్స్’ మూవీ రికార్డ్ – 4రోజుల్లో – రూ.100కోట్లు

ఈ నెల 17న రిలీజ్ అయింది జేమ్స్ చిత్రం. ఇది క‌న్న‌డ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కి ఆఖ‌రి చిత్రం. భారీ స్థాయిలో విడుదల అయిన ఈ చిత్రం… భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిందిఆ తరువాత కూడా అదే జోరును కొనసాగించింది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. హీరోగానే కాదు .. మంచి మనిషిగా అక్కడ ఆయనకి మంచి పేరు ఉంది. ఇక ఇతర ఇండస్ట్రీ హీరోలతోను ఆయనకి మంచి అనుబంధం ఉంది. కన్నడలో ఇతర భాషల హీరోల సినిమాలను కూడా ఎంతో ఉత్సాహంగా ప్రమోట్ చేయగలగడం ఆయన గొప్పతనమని చెబుతుంటారు. అలాంటి పునీత్ రాజ్ కుమార్ తన అభిమానులను శోకసముద్రంలో ముంచేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ‘జేమ్స్’ సినిమాను పూర్తిచేసిన తరువాత ఈ దారుణం జరిగింది. పునీత్ పాత్రకి శివరాజ్ కుమార్ వాయిస్ ఇచ్చారు. కిశోర్ పత్తికొండ నిర్మించిన ఈ సినిమాకి చేతన్ కుమార్ దర్శకత్వం వహించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement