Thursday, April 18, 2024

రేపు దేశవ్యాప్తంగా 24 లక్షల మందికి పరీక్ష

ప్రముఖ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరోతగరతిలో ప్రవేశాలకు నిర్వహించే జవహర్ నవోదయ సెలక్షన్ పరీక్ష -2021 రేపు (ఆగస్టు 11న) జరగనుంది. వాస్తవానికి ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10న జరగాల్సి ఉండగా.. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. కరోనా నిబంధనల ప్రకారం ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

కాగా వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా 62 సెంటర్లను మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. navodaya.gov.in వెబ్‌సైట్ ద్వారా మారిన ఎగ్జామ్ సెంటర్లు చూడటంతో పాటు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో ఎంట్రన్స్ టెస్టు ఉండనుంది. దేశవ్యాప్తంగా 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు.

ఈ వార్త కూడా చదవండి: 147 రోజులలో ఇదే ఫస్ట్ టైమ్.. @ఇండియా కరోనా అప్డేట్

Advertisement

తాజా వార్తలు

Advertisement