Saturday, April 20, 2024

జంగారెడ్డిగూడెం ఘ‌ట‌నపై – ఏపీ ప్ర‌భుత్వంపై మండిప‌డిన చంద్ర‌బాబు

ఏపీలో అస‌లు ప్ర‌భుత్వం ఉందా అని మండిప‌డ్డారు టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు. ప‌శ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా కార‌ణంగా వరుసగా మరణాలు సంభ‌విస్తున్నాయి. ఆ ప్రాంతంలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌ల ప్రాణాలు పోతున్నప్ప‌టి ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జంగారెడ్డిగూడెంలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నప్ప‌టికీ ప్ర‌భుత్వం చర్యలు తీసుకోవ‌ట్లేద‌ని చెప్పారు. అక్క‌డ చోటు చేసుకున్న‌ మరణాలపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలన్నారు. వ‌రుస మ‌ర‌ణాల‌తో స్థానికంగా ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భయాందోళనలను పోగొట్టాలని ఆయ‌న అన్నారు. నాటుసారా తాగి మ‌ర‌ణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయ‌న కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement