Wednesday, April 24, 2024

ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేయొద్దు – నాగ‌బాబు

ఈ మ‌ధ్య మీడియాలో ఫేక్ న్యూస్ లు ఎక్కువ‌య్యాయ‌ని న‌టుడు నాగ‌బాబు అన్నారు. కాగా ఉత్త‌రాంధ్ర‌లో తాను ప‌ర్య‌టించనున్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌ను జ‌న‌సేన నేత నాగ‌బాబు ఖండించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ లో దీనిపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. నేను ఈ నెల 17న ఉత్తర ఆంధ్ర‌లో ప‌ర్య‌టించ‌నున్నాన‌ని వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేదు. నిర్ధార‌ణ చేసుకోకుండా మీడియాలో ఇటువంటి వార్త‌లు ఇవ్వ‌డం మానుకోవాలి. ఏమైనా పర్య‌ట‌న‌లు ఉంటే అందుకు సంబంధించిన షెడ్యూల్ గురించి జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని నాగ‌బాటు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement