Saturday, April 20, 2024

పోలీసుల‌పై పవన్ ఆగ్రహం.. కారుపైకి ఎక్కి…

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంపై పోలీసులు ఆంక్షలు విధించారు. జనసేనాని సభకు అడుగడుగునా ఆటంకం సృష్టిస్తున్న ప్రభుత్వంపై పవన్ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ‌మండ్రి ఎయిర్ పోర్టు నుంచి ప‌వ‌న్ వెంట వెళ్ల‌డానికి కొన్ని వాహ‌నాలకు మాత్ర‌మే అనుమ‌తులు ఇచ్చారు. బాలాజీపేట సెంటర్ స‌మీపంలో హుకుంపేట-బాలాజీపేట రోడ్డు వ‌ద్ద పోలీసులు మోహ‌రించారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకుంటున్న విష‌యాన్ని గుర్తించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న కారుపైకి ఎక్కి పోలీసుల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేది? అంటూ ప్రశ్నించారు. దీంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేక‌లు వేశారు. అనంత‌రం బాలాజీపేట‌కు చేరుకుని శ్ర‌మ‌దానంలో పాల్గొన్నారు.   

ఇది కూడా చదవండిః దూసుకొస్తున్న ‘షహీన్’ తుఫాను.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement