Wednesday, April 24, 2024

ముగ్గురు టెర్ర‌రిస్టుల‌ను – ప్రాణాల‌తో ప‌ట్టుకున్న జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు

ముగ్గురు టెర్ర‌రిస్టుల‌ను జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు ప్రాణాల‌తో ప‌ట్టుకున్నారు. వీరు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన వారు. ఉత్తర కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇటీవల నాన్ లోకల్ కార్మికులను చంపడం, వివిధ ప్రాంతాల్లో గ్రెనేడ్లు విసిరి అలజడి సృష్టించడం వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందనే విషయం విచారణలో తేలిందన్నారు. వీటికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పండ్ల తోటల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వీరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పక్కా ప్రణాళికతో వీరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి మూడు చైనీస్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గందేర్ బల్ ప్రాంతంలో కూడా ఒక స్కార్పియో వాహనంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాథీనం చేసుకున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement