Thursday, March 28, 2024

Jammu : వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో ఆగ‌మోక్తంగా క్షీరాధివాసం

నేడు మ‌జీన్ గ్రామంలో తావి న‌ది ఒడ్డున టిటిడి నిర్మించిన వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో ఆగ‌మోక్తంగా క్షీరాధివాసం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు పండితులు.. మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా బింబశుద్ధి కోసం క్షీరాధివాసం చేపట్టారు. శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి , గోదాదేవి, గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలకు గోవు పాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ విమానగోపురం, ధ్వజస్తంభాలను అద్దంలో చూపి పాలతో అభిషేకం చేశారు.అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరు వేణుగోపాలదీక్షితులు, కంకణభట్టార్ రామకృష్ణ దీక్షితులు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి, శివప్రసాద్, ఈఈ సుధాకర్, డిప్యూటీ ఈఈలు రఘువర్మ, చెంగల్రాయలు, ఏఈవో కృష్ణారావు, ఏఈ సీతారామరాజు, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.కాగా జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి నది ఒడ్డున ఈ ఆల‌యాన్ని నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement