Saturday, April 20, 2024

బీబీసీ ఆఫీసుల్లో మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

గత మూడు రోజులుగా బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 11.30గంటల సమయంలో ఐటీ అధికారులు బీబీసీ ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో సోదాలు మొదలుపెట్టారు. మూడు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీ అధికారులు బీబీసీ సిబ్బంది నుంచి కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇన్ కం ట్యాక్స్ సర్వే ప్రారంభమైన నాటి నుంచి కంపెనీకి చెందిన 10 మంది సీనియర్ ఉద్యోగులు ఆఫీసులోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఐటీ సర్వే ప్రభావం బీబీసీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని కంపెనీ ప్రకటించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement