Thursday, March 28, 2024

అగో ఇట్లెట్ల చేస్తరు?.. బీజేపీ వర్సెస్​ టీఆర్​ఎస్​ ప్రోగ్రామ్​ కాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా కేంద్ర హోం మంత్రి అమిత్​షా వ్యవహరిస్తున్నారని టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ అన్నారు. సెప్టెంబర్​ 17న తెలంగాణలో వేడకలు జరిపే ముందు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇది బీజేపీ వర్సెస్​ టీఆర్​ఎస్​ కార్యక్రమం కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం అన్నారు. ఓ మీడియా సంస్థతో ఇవ్వాల (శనివారం) మాట్లాడిన ఆయన పలు అంశాలపై కేంద్రానికి, అమిత్​షాకు ప్రశ్నలు సంధించారు.

ఇద్దరు సీఎంలతో కేంద్ర హోం మంత్రి ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రభుత్వానికి పోటా పోటీగా ప్రోగ్రామ్​ చేస్తున్నారు. వాస్తవానికి, రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన రోజు ఇది. కానీ, కొందరేమో విమోచనం అంటున్నారు, ఇంకొంతమంది విలీనం అంటున్నారని.. వారికి రాజకీయం చేయడం మినహా స్పష్టమైన విధానం లేదన్నారు మంత్రి కేటీఆర్​.

Advertisement

తాజా వార్తలు

Advertisement